నిజంనిప్పులాంటిది

Mar 26 2024, 10:27

తెలంగాణ రాష్ట్రంలో హోలీ పండగ పూట విషాదాలు

హోలీ పండుగ పూట సోమ వారం పలు కుటుంబాల్లో విషాదఛాయలు నెలకొన్నా యి.

కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబా బాద్, రంగారెడ్డి జిల్లాల్లో జరిగిన వేర్వేరు సంఘట నల్లో ఏడుగురు యువకు లు, ఒక బాలుడు మృతి చెందారు.

సికింద్రాబాద్ కంటోన్మెం ట్ పరిధిలో ద్విచక్ర వాహనా లపై వెళ్తున్న వారిని లారీ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.వివరాల్లోకి వెళ్తే..కొమురం భీం ఆసిఫా బాద్ జిల్లా, కౌటాల మండ లం, నదిమాబాద్ గ్రామానికి చెందిన ఆరుగురు స్నేహితు లు సోమవారం ఉదయం హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు.

అనంతరం మధ్యాహ్నం స్నానం చేయడాని కో సం వార్ధా నది వద్దకు వెళ్లారు. వీరిలో ఇద్దరు స్నానం చేసి ఒడ్డుపైకి వచ్చారు. మిగతా నలుగురు నదిలో స్నానం చేస్తూ లోతుగా ఉన్న ప్రదేశంలోకి వెళ్లి గల్లంత య్యారు.

దీంతో నది ఒడ్డున ఉన్న మిగతా ఇద్దరు వెంటనే గ్రామానికి వెళ్లి కుటుంబ సభ్యులకు తెలియజేయ డంతో వారు పరుగుపరు గున,వచ్చిగాలింపు చర్యలు చేపట్టారు.

పోలీసులు గజ ఈతగాళ్లతో నదిలో గాలించ గా అల్లం సాయి (22), ఉప్పల సంతోష్ (24), ప్రవీణ్ (24), కమలాకర్ (24) అనే నలుగురి మృతదేహా లు లభ్యమయ్యాయి.

మృతులంగా ఒకే గ్రామానికి చెందినవారు కావడంతో ఆయా కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నా యి. జిల్లా ఎస్‌పి సురేష్‌ కుమార్, డిఎస్‌పి కరుణా కర్, సంఘటన స్థలానికి చేరుకొని సంఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు.

నిజంనిప్పులాంటిది

Mar 26 2024, 10:25

తెలంగాణ లో ముదురుతున్న ఎండలు

రాష్ట్రంలో ఎండలు ముదు రు తున్నాయి. పలు ప్రాంతా ల్లో పగటి ఉష్ణోగ్రతలు సెగలు చిమ్ముతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా రికార్డవుతున్నాయి.

రాగల ఐదు రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు హైదరాబాద్ వాతా వరణ కేంద్రం వెల్లడించింది. ఉదయం వేళల్లో పొగముం చు వాతావరణం నెలకునే అవకాశం ఉంది.ఉష్ణోగ్రతలు గరిష్టంగా 37, కనిష్టంగా 24డిగ్రీలు నమోదయ్యే అవకాశాలున్నాయి.

తరువాత 48గంటల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38డిగ్రీలకు పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం వెల్లడిం చింది. రాష్ట్రంలో కూడా సగటు ఉష్ణోగ్రతలు గరిష్టం గా 38నుంచి 41డిగ్రీలు నమోదయ్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది.

రాష్ట్రంలో మంగళవారం ఉష్ణోగ్రతల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం తెలిపిం ది. 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, నిజామాబాద్, కొమరంభీం, అదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, రంగారెడ్డి, పెద్దపల్లి, ములుగు, కరీంనగర్, వరంగల్ జిల్లాలు ఆరెంజ్ అలర్ట్ జాబితాలో ఉన్నాయి.

ఈ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీలకు పైనే నమోద య్యే అవకాశాలు ఉన్నట్టు తెలిపింది. ప్రజలు అప్రమ త్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది....

నిజంనిప్పులాంటిది

Mar 24 2024, 16:32

Kejriwal: నిర్బంధంలో ఉన్న డోంట్ కేర్.. ఫస్ట్ ఆర్డర్ జారీ చేసిన కేజ్రీవాల్

మద్యం కుంభకోణంలో కేసులో అరెస్టైన దిల్లీ సీఎం కేజ్రీవాల్ ( Kejriwal ) నిర్బంధం నుంచే ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఈ మేరకు దిల్లీ ప్రభుత్వానికి సంబంధించి తన మొదటి ఉత్తర్వును జలవనరుల శాఖకు జారీ చేశారు..

ఇవాళ సమావేశం నిర్వహించనున్న ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి సీఎం ఆదేశాల గురించి సమాచారం ఇవ్వనున్నారు. కేజ్రీవాల్‌ అరెస్టుతో దిల్లీ ప్రభుత్వం ఎలా నడుస్తుందనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది.

కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే అనుమానం చాలా మందికి కలిగింది. సీఎం కేజ్రీవాల్ ను జైలుకు పంపితే అక్కడి నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తానని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ చేసిన ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి అనుమతి తీసుకుని ప్రభుత్వాన్ని నడిపేందుకు జైలులోనే కార్యాలయం నిర్మిస్తామని పంజాబ్‌ సీఎం చెప్పారు. పార్టీలో అరవింద్ కేజ్రీవాల్ స్థానాన్ని ఎవరూ తీసుకోలేరని తెలిపారు. అవినీతి వ్యతిరేక ఉద్యమం ద్వారా పార్టీని స్థాపించారని గుర్తు చేసుకున్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపలేమని రాజ్యాంగంలో ఎక్కడా రాయలేదని, చట్టం ప్రకారం నేరం రుజువయ్యేంత వరకు జైలు నుంచే పని చేయవచ్చని మాన్‌ స్పష్టం చేశారు.

సుమారు 2 గంటల విచారణ జరిపిన అనంతరం మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. అనంతరం కోర్టు కేజ్రీవాల్ కు మార్చి 28 వరకు ఈడీ కస్టడీకి పంపింది. కేజ్రీవాల్ అరెస్టుపై పార్టీ నేతలు భగ్గుమన్నారు. ఈడీని బీజేపీ దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ప్రతిపక్ష పార్టీల నేతలను అరెస్టు చేయడం బీజేపీకి అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ కేసులో కేజ్రీవాల్ కంటే ముందు దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీష్ సిసోడియా, మాజీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్, రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ లను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

నిజంనిప్పులాంటిది

Mar 24 2024, 09:24

టెట్ పరీక్ష కు నార్మలైజేషన్ ఉందా? లేదా? అభ్యర్థుల్లో గందరగోళం

ఉపాధ్యాయ ఉద్యోగస్తులకు నిర్వహించే టీచర్‌ ఎలిజిబి లిటీ టెస్ట్‌ టెట్‌, పలు వివా దాలకు కేంద్రంగా మారుతు న్నది...

ఇప్పటికే ఫీజుల పెంపుతో అభ్యర్థుల నడ్డివిరిచిన సర్కారు.. నోటిఫికేషన్‌లో నార్మలైజేషన్‌పై స్పష్టత ఇవ్వకపోవడం మరో వివాదానికి కారణమైంది. టెట్‌లో నార్మలైజేషన్‌ ఉంటుందా? ఉండదా? అనే సందేహాలు అభ్యర్థులను పట్టిపీడిస్తున్నాయి.

టెట్‌ నోటిఫికేషన్‌లో నార్మ లైజేషన్‌పై విద్యాశాఖ ఎలాంటి స్పష్టతనివ్వలేదు. టెట్‌ను తొలిసారిగా కంప్యూ టర్‌ బేస్డ్‌ టెస్ట్‌ సీబీటీ,విధా నంలో నిర్వహించబోతు న్నారు.

మే 20 నుంచి జూన్‌ 3 వరకు 15 రోజులపాటు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో సెషన్‌లో 30 -35 వేల మందికి మాత్రమే పరీక్షను నిర్వహించే వీలుంది. ఒకే సబ్జెక్టుకు రెండు, మూడు సెషన్లల్లో పరీక్షలు నిర్వహిం చే అవకాశముంది.

ఒక పేపర్‌ ఈజీగా..లేదా మధ్యస్తంగా.. మరో పేపర్‌ కఠినంగా వస్తే ఆయా సెషన్‌లో పరీక్షకు హాజరైన వారికి ఇబ్బందులు తలెత్తే అవకాశముంది.సులభంగా ప్రశ్నలొచ్చిన వారికి లాభం జరగగా, కఠినంగా వచ్చినవారికి నష్టం కలిగే అవకాశమున్నది.

ఇంతటి కీలకమైన విష యంపై విద్యాశాఖ స్పష్ట తనివ్వకపోగా, ఈ విషయా న్ని పూర్తిగా విస్మరించడం గమనార్హం. గతంలో టెట్‌ను ఆఫ్‌లైన్‌లో నిర్వహించడం వల్ల అభ్యర్థులందరికీ ఒకే ప్రశ్నపత్రాన్నిచ్చేవారు.

పేపర్ల మూల్యాకంనంలో ఇబ్బందులొచ్చేవి కాదు. కానీప్పుడు ఆన్‌లైన్‌లో నిర్వహించడంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవు తున్నాయి. దీనిపై విద్యా శాఖకు చెందిన ఓ ఉన్నతా ధికారిని సంప్రదించగా.. ఇప్పటి వరకు నార్మలైజే షన్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.

అన్నింటా అమలు..

ఆన్‌లైన్‌లో నిర్వహించే పరీ క్షలన్నింటిలోనూ నార్మలైజే షన్‌ విధానం అమవుతు న్నది. మరి ఇలాంటప్పుడు టెట్‌కెందుకు లేదన్న ప్రశ్నలు అభ్యర్థుల నుంచి వినిపిస్తు న్నాయి.

జాతీయంగా నిర్వహించే జేఈఈ మొదలుకొని.. టీఎస్‌పీఎస్సీ, గురుకుల నియామక పరీక్షలన్నింటిలో నార్మలైజేషన్‌ను అమలు చేస్తున్నారు.

నిజంనిప్పులాంటిది

Mar 24 2024, 09:23

3, 6 తరగతులకు కొత్త సిలబస్‌

వచ్చే విద్యా సంవత్సరానికి (2024-25) సంబంధించి 3, 6 తరగతుల సిలబస్‌ మారనుందని సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ సీబీఎస్‌ఈ, వెల్లడించింది.

ఈ రెండు తరగతులకు మినహా మిగిలిన వాటికి మారబోదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని తన అను బంధ పాఠశాలలకు సీబీఎస్‌ ఈ తెలియజేసింది.

3, 6 తరగతుల కొత్త సిల బస్‌తో పాటు పాఠ్యపుస్త కాలను త్వరలో విడుదల చేస్తామని సీబీఎస్‌ఈకి విద్య, పరిశోధన, శిక్షణ జాతీయ మండలి ఎన్‌సీ ఈఆర్‌టీ, సమాచారం ఇచ్చింది.

పాఠశాలలన్నీ కొత్త సిల బస్‌ను అనుసరించాలని సీబీఎస్‌ఈ డైరెక్టర్‌ అకడ మిక్స్‌ జోసెఫ్‌ ఎమ్మాన్యు యేల్‌ సూచించారు. 6వ తరగతి విద్యార్థులకు అద నంగా బ్రిడ్జి కోర్సు ఉంటుంది.

3వ తరగతికి కుదించిన విధివిధానాలను ఎన్‌సీ ఈఆర్‌టీ,విడుదల చేయ నుంది. కొత్త విద్యా విధానా నికి అనుగుణంగా పాఠశా లల అధిపతులకు, ఉపా ధ్యాయులకు సామర్థ్య నిర్వహణ శిక్షణ కార్యక్ర మాలను చేపడతాం’ అని వివరించారు...

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:15

ఫోన్ ట్యాపింగ్ కేసు: పోలీసుల అదుపులో ఏఎస్పీ భుజంగరావు

హైదరాబాద్‌: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తాజాగా మరో కీలక మలుపు చోటు చేసుకుంది. భూపాలపల్లి అదనపు ఎస్పీ భుజంగరావుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు..

ప్రణీత్ రావుతో కలిసి భుజంగరావు ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి..

భూపాలపల్లి ఏఎస్పీగా ఉన్న భుజంగరావు.. గతంలో తెలంగాణ ఇంటెలిజెన్స్‌లో పనిచేశారు. రేపు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరు పర్చునున్నారు. ప్రణీత్ రావును, భుజంగరావును శనివారం పోలీసులు ఎనిమిది గంటలపాటు విచారించారు. అనంతరం బంజారాహిల్స్ పోలీస్ పోలీసులు.. భుజంగరావు అదుపులోకి తీసుకున్నారు.

ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్రావును ఇప్పటికే ఆరు రోజుల పాటు పోలీసులు విచారించారు. రేపు( ఆదివారం) మెజిస్ట్రేట్ ఇంట్లో హాజరుపరిచే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది. ప్రణీత్‌రావు ఇచ్చిన సమాచారం ఆధారంగా.. ఎస్‌ఐబీలో పని చేసిన పలువురు అధికారులు, కానిస్టేబుల్స్‌ను పిలిచి విచారించారు..

మరోవైపు ఎస్‌ఐబీలో పని చేసిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌లో స్పెషల్ టీమ్ ముందు హాజరయ్యారు. వీరితో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎస్‌ఐబీలో పని చేసిన వాళ్లందరినీ విచారించే అవకాశం ఉ‍న్నట్లు తెలుస్తోంది..

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:14

ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ సోదాలు

హైదరాబాద్‌: ఎమ్మెల్సీ కవిత బంధువుల నివాసాల్లోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. కవిత భర్త అనిల్‌ బంధువుల ఇళ్లలో శనివారం ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి..

మాదాపూర్‌లో అనిల్‌ సోదరి అఖిల నివాసంలో అధికారులు తనిఖీలు చేపట్టారు..

మరోవైపు కవిత ఈడీ కస్టడీ నేటితో ముగియనుంది. మధ్యాహ్నం 12.30 తర్వాత ఆమెను రౌస్ అవెన్యూ సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.

మద్యం కేసులో దిల్లీ సీఎంను తమ కస్టడీకి తీసుకున్న ఈడీ అధికారులు.. కేజ్రీవాల్, కవితను ఒకేసారి విచారించే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలో కవితను మరో 3 రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులు కోరనున్నట్లు సమాచారం..

Streebuzz News

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:13

సికింద్రాబాద్‌ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావుగౌడ్‌

సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రక టించారు.

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న పద్మారావు గౌడ్‌ను బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ లోకి దింపాలని నిర్ణయిం చారు.

పార్టీ శాసన సభ్యులు, ప్రజాప్రతినిధుల ఇతర ముఖ్య నేతలతో జరిగిన సమావేశంలో అభిప్రాయా లను సేకరించిన అనంతరం నిర్ణయాన్ని ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్

కాగా...కేసీఆర్.పార్టీ సీని యర్‌ నేతగా ఉద్యమకాలం నుంచి, విధేయుడిగా పద్మా రావు గౌడ్‌ గుర్తింపు తెచ్చు కున్నారని ఆ పార్టీ నేతలు చెబుతారు.

SB News

Streetbuzz News

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:11

కారుణ్య నియమాలకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సిగ్నల్

విద్యుత్ శాఖలో కారుణ్య నియామకాలకు బ్రేక్ వేస్తూ గత సర్కారు తీసుకున్న విధాన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. విధి నిర్వహణలో ఉంటూ చనిపోయినవారి పిల్లలకు కారుణ్య నియామకాలు ఇవ్వకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది.

మార్చి 4, 2020న జరిగిన 42వ బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయం, దానికి అనుగుణంగా ఏప్రిల్ 29, 2020న విడుదల చేసిన ఉత్తర్వులను తాజా ప్రభు త్వం ఉపసంహరించుకు న్నది.

దీంతో కారుణ్య నియామ కాలకు వెసులుబాటు లభిం చింది. గత ప్రభుత్వం లో కారుణ్య నియామకాల కోసం వచ్చిన దరఖాస్తులను తిరస్కరించడంతో ఇప్పుడు వాటిని మళ్ళీ పరిగణనలోకి తీసుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలో ఉంది.

ఇందుకు అనుగుణంగా ఏకీకృత యూనిఫాం పాలసీని రూపొందించా లంటూ విద్యుత్ శాఖ పరిధిలోని అన్ని కార్పొరేట్ ఆఫీసులకు సీఎండీ తాజా గా,ఉత్తర్వులు జారీ చేశారు.

గతంలో కారుణ్య నియామ కం కోసం దరఖాస్తు చేసుకు న్నవారికి మళ్లీ అప్లికేషన్ ప్రొఫార్మా ఫార్మాట్ ను రూ పొందించాలని, మరోసారి దరఖాస్తు చేసుకోడానికి వారికి అవకాశం కల్పించా లని సూచించారు.

చనిపోయిన ఉద్యోగుల పిల్లల/జీవిత భాగస్వామికి మాత్రమే కాకుండా విధి నిర్వహణకు శారీరకంగా స్థోమత లేని ఉద్యోగుల విషయంలోనూ కారుణ్య నియామకాలకు అవకాశం ఇవ్వాలని తాజా ఉత్త ర్వుల్లో సీఎండీ పేర్కొ న్నారు..

నిజంనిప్పులాంటిది

Mar 23 2024, 20:10

భారీగా పెరిగిన టెట్ పరీక్ష ఫీజు

రాష్ట్ర ప్రభుత్వం టెట్ ఫీజు ను భారీగా పెంచింది. గతం లో ఒక పేపర్‌ రాస్తేరూ.200 రుసుం ఉండగా, దాన్నిరూ. వెయ్యికి పెంచింది.

రెండు పేపర్లు రాస్తే గతంలో రూ.300 రుసుం ఉండగా, దాన్ని రూ.2,000కు పెంచింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు https:// schooledu.telangana.gov.in/ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించిం ది. మే 15 నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకో వచ్చని పేర్కొంది...